సూర్యాపేట: చదువుతోనే సమాజంలో వెలుగులు నిండుతాయని, మనిషి ఉన్నతికి చదువు దోహదపడుతుందని చాటి చెప్పిన గొప్ప మహనీయుడు మహాత్మా జ్యోతిరావు పూలే అని మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. మహాత్మా జ్యోతిరావు పూలే 131వ వర్ధంతి సందర్భంగా సూర్యాపేటలో పూలే విగ్రహానికి పూలమాల వేసి మంత్రి నివాళులర్పించారు. అనంతరం మాట్లాడుతూ.. 150 ఏండ్ల క్రితమే చదువు గొప్పదనాన్ని తెలియజేసి, మహిళలు సైతం చదువుతోనే సమగ్రాభివృద్ధి సాధిస్తారని పూలే చాటిచెప్పారని తెలిపారు. ప్రతి ఒక్కరు మహాత్మా పూలే బాటలో నడిచి సమాజాభివృద్ధికి పాటు పడాలన్నారు. ఈ వేడుకల్లో మున్సిపల్ చైర్పర్సన్ అన్నపూర్ణ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షుడు నిమ్మల శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు.