సూర్యాపేట: భక్తి, త్యాగం, కరుణలకు బక్రీద్ ప్రతిరూపమని మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jadadish reddy) అన్నారు. సమాజ హితాన్ని కోరుకునే పర్వదినమని ఆయన చెప్పారు. బక్రీద్ (Bakrid) పర్వదినాన్ని పురస్కరించుకుని సూర్యాపేట (Suryapet) జిల్లా కేంద్రంలోని ఈద్గ వద్ద జరిగిన వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. బక్రీద్ సందర్భంగా జరిగిన ప్రార్థనలలో పాల్గొన్న ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ.. సర్వమత సౌభ్రాతృత్వానికి తెలంగాణ (Telangana) ప్రతీకగా నిలిచిందన్నారు.
గంగా జమునా తెహజీబ్ను కాపాడుకుంటూ తెలంగాణ ఆధ్యాత్మిక పరంపరను కొనసాగిస్తున్నామని చెప్పారు. స్వరాష్ట్రంలో సూపరిపాలనను అందిస్తున్న ముఖ్యమంత్రి కేసీఆర్ (CM KCR) నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం.. మైనారిటీ సంక్షేమానికి పెద్ద పీట వేసిందన్నారు. సంక్షేమంతోపాటు మైనారిటీలను ఉన్నత విద్యావంతులుగా తీర్చి దిద్దేందుకు గురుకులాలు నెలకొల్పిందని చెప్పారు.