Jagadish Reddy | సూర్యాపేట : దివంగత కల్నల్ సంతోష్ బాబు త్యాగం చరిత్ర పుటల్లో చిరస్మరణీయంగా నిలిచి పోతుందని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. కల్నల్ సంతోష్ బాబు మూడో వర్ధంతిని పురస్కరించుకుని సూర్యాపేట పట్టణంలోని ఆయన విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు మంత్రి జగదీశ్ రెడ్డి. దేశం కోసం త్యాగం చేసిన దివంగత సంతోష్ బాబు వర్తమానానికి స్ఫూర్తి దాయాకంగా నిలిచారన్నారు.
ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు బడుగుల లింగయ్య యాదవ్, మున్సిపల్ చైర్మన్ పెరుమాండ్ల అన్నపూర్ణమ్మ, కల్నల్ సంతోష్ బాబు కుటుంబ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.