International Nurses Day | అమ్మ తర్వాత అంతటి సేవలు అందిస్తున్న ఘనత సమాజంలో నర్సింగ్ సిబ్బందిదేనని మంత్రి జగదీశ్రెడ్డి ప్రశంసించారు. అంతర్జాతీయ నర్సుల దినోత్సవం సందర్భంగా జిల్లాకేంద్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాల ఆడిటోరియంలో నిర్వహించిన వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. నర్సుల వృత్తికి గౌరవాన్ని తీసుకువచ్చిన ఫ్లోరైన్స్ నైటింగేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యరంగంలో కీలకపాత్ర పోసిస్తూ ఆరోగ్య రక్షణలో నర్సులు ఎనలేని తోడ్పాటునందిస్తున్నారన్నారు. కరోనా సమయంలోనూ సేవలు అమోగమైనవని, ఆ సమయంలో సూర్యాపేట సిబ్బంది సేవలు యావత్ దేశానికే ఆదర్శంగా నిలిచాయన్నారు. సీఎం కేసీఆర్ ప్రసాదించిన మెడికల్ కళాశాలతో మెరుగైన వైద్యం, వైద్య విద్య మరింత చేరువయ్యాయన్నారు. ప్రారంభం నాటి నుంచి అద్భుతమైన సేవలందిస్తున్నామని, రాబోయే రోజుల్లోనూ మరింత ఆదర్శంగా తీర్చిదిద్దుకుందామన్నారు.
ఇప్పటికే ప్రభుత్వ మెడికల్ కళాశాల పక్కాభవనం పూర్తయ్యిందని, త్వరలోనే నర్సింగ్తో పాటు అన్ని పక్కా భవనాలు నిర్మించుకుందామన్నారు. సూర్యాపేటలో చదువుతున్న నర్సింగ్ విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా సేవలందించాలని ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. అహర్నిశలు కష్టపడి చదవి వారి కుటుంబానికి, కళాశాలకు పేరు తీసుకురావాలని సూచించారు. ఈ వేడుకల్లో డీఎంహెచ్వో కోటా చలం, ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి సూపరింటెండెంట్ దండ మురళీధర్ రెడ్డి, కళాశాల ప్రిన్సిపాల్ శారదా దేవి, జడ్పీ వైస్ చైర్మన్ గోపగాని వెంకట్ నారాయణ గౌడ్ పాల్గొన్నారు.