నల్లగొండ : జిల్లా సీపీఎం కేంద్ర కార్యాలయంలో తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటయోధురాలు, మాజీ ఎమ్మెల్యే, సీపీఎం సీనియర్ నేత దివంగత మల్లు స్వరాజ్యం పార్థివ దేహానికి రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. రాజాకార్ల దుర్మా్ర్గాలను ఎదురించిన ధీర వనిత మల్లు స్వారాజ్యం అన్నారు. ఆమె పోరాట స్ఫూర్తి నేటి యువతరానికి ఆదర్శమన్నారు.