Minister Jagadish Reddy | సీఎం కేసీఆర్తోనే అన్ని వర్గాలకు న్యాయం జరిగిందని, 75 ఏళ్ల కాంగ్రెస్, బీజేపీ పాలనలో రాష్ట్రానికి, దేశానికి ఒరిగిందేమీ లేదని మంత్రి జగదీశ్రెడ్డి అన్నారు. సూర్యాపేటలోని సుమంగళి ఫంక్షన్ హాల్లో బీఆర్ఎస్ కార్యకర్తల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాబోయే ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి పెన్పహాడ్, ఆత్మకూర్ మండలాలకు చెందిన బీఆర్ఎస్ బూత్ ఇన్ఛార్జీలకు, నేతలకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
కాంగ్రెస్, బీజేపీలది అధికార యావ అయితే.. బీఆర్ఎస్ది అభివృద్ధి తోవ అన్నారు. బీఆర్ఎస్ సిద్ధాంతం అభివృద్ధి మాత్రమేనని, 75 ఏళ్ల పరాయి పాలనలో కానీ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను తొమ్మిది ఏళ్లలోనే చేసి.. సీఎం కేసీఆర్ కేసీఅర్ దేశంలోనే తిరుగులేని రాజకీయ శక్తిగా బీఆర్ఎస్ను నిలిపారన్నారు. ఎన్నికల సమీపిస్తున్న నేపథ్యంలో బీఆర్ఎస్ కార్యకర్తలు సైనికుల తీరుగా రాష్ట్రాన్ని కాపాడుకోవాలని పిలుపునిచ్చారు. జాగ్రత్తగా ఉండకపోతే భవిష్యత్ చీకటే అవుతుందన్నారు.
సీఎం కేసీఆర్ అందిస్తున్న సుపరిపాలనతో దేశంలోనే రాష్ట్రం నెంబర్వన్గా దూసుకుపోతుందన్నారు. ఎన్నికల సందర్భంగా మేనిఫెస్టోను ప్రకటించి.. వందశాతం అమలు చేసిన పార్టీ బీఆర్ఎస్ మాత్రమేనన్నారు. ఎన్నికల్లో చెప్పని కల్యాణలక్ష్మి, రైతుబీమా, తదితర ఎన్నో సంక్షేమ పథకాలను కేసీఆర్ ప్రవేశపెట్టారన్నారు. ప్రభుత్వం తీసుకువచ్చిన పథకాలను ప్రజల్లో్కి తీసుకెళ్లాలన్నారు. ప్రతిపక్షాల తప్పుడు ప్రచారాన్ని తొప్పికొడుతూ రాబోయే ఎన్నికల్లో హ్యాట్రిక్ సాధించాలన్నారు.