Minister Jagadish Reddy | రాష్ట్రంలోని వైద్య రంగంలో విప్లవాత్మకమైన మార్పులు తెచ్చిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్దేనని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీశ్ రెడ్డి కొనియాడారు. అందరికీ ఆధునిక వైద్యం అందుబాటులో ఉంచాలన్నదే కేసీఆర్ సంకల్పమని పేర్కొన్నారు. కోదాడ నియోజకవర్గంలోని మునగాల మండల కేంద్రంలో రూ.1.56 లక్షలతో నిర్మించనున్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి మంత్రి జగదీశ్ రెడ్డి బుధవారం ఉదయం శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్ పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి జగదీశ్రెడ్డి మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని ఆరోగ్యవంతమైన తెలంగాణగా తీర్చిదిద్దాలని సీఎం కేసీఆర్ నిర్ణయించాలని తెలిపారు. అందులో భాగంగానే పల్లె నుంచి పట్నం దాకా ప్రజలందరికీ వైద్య సేవలు అందుబాటులో ఉండేందుకు వీలుగా ఎక్కడికక్కడ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. ప్రభుత్వ ఆసుత్రుల్లో వైద్యం అంటేనే చీదరించుకునే స్థాయి నుంచి వైద్య సేవలు అంటే సర్కార్ ఆసుపత్రిలోనే అనే స్థాయికి చేర్చిన నేత ముఖ్యమంత్రి కేసీఅర్ అని ఆయన కొనియాడారు.