సూర్యాపేట : జీవిత లక్ష్యం సాధించేంత వరకు యువత పట్టుదలతో ముందుకు సాగాలని రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్రెడ్డి(Minister Jagadish Reddy) పిలుపునిచ్చారు. పరీక్షలు, క్రీడల్లో గానీ ఓటమి పాలైతే నిరాశ చెందకుండా ఓటమి నుంచి స్ఫూర్తి పొందడమే అసలైన గెలుపునకు నాంది అని అన్నారు.
శుక్రవారం సూర్యాపేట జిల్లా(Suryapeta District) కేంద్రంలో జిల్లా పోలీసు శాఖ(Police Department) ఆధ్వర్యంలో అభ్యర్థులకు నిర్వహించిన ప్రేరణ(Motivation) కార్యక్రమంలో మంత్రి పాల్గొని మాట్లాడారు. యువత నిరంతరం ఆశావాహులై ఉండాలని సూచించారు. ఆలోచనలలో పేదరికం వద్దని, యువత ఆలోచనలు గొప్పగా ఉండాలని అన్నారు.పనిచేసే లక్షణమే యువత కు గొప్ప ఆయుధమని పేర్కొన్నారు.
ఏ పని చేయకుండా ఉంటే దరిద్ర్యమేనని వివరించారు.చదువు అంటే ఉద్యోగం అనే భావనను విడనాడాలని కోరారు.ప్రస్తుత పోటీ ప్రపంచంలో యువత క్రీడా స్ఫూర్తిని (Sportsmen Spirit) ని అలవర్చుకోవాలన్నారు. ఈ సందర్భంగా ఆదివారం కానిస్టేబుల్ రాత పరీక్షలకు వెళుతున్న విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ రాజేంద్ర ప్రసాద్, అడిషనల్ కలెక్టర్ పాటిల్ హేమంత్ కేశవ్ తదితరులు పాల్గొన్నారు.