హైదరాబాద్ : ఓటమి భయంతో మునుగోడులో కొత్తనాటలకాలకు బీజేపీ తెరలేపిందని మంత్రి జగదీశ్రెడ్డి విమర్శించారు. బీజేపీపై టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల దాడి అంటూ అబద్ధపు ప్రచారం చేస్తున్నారని, మునుగోడు రిటర్నింగ్ ఆఫీసర్ కార్యాలయం వద్ద రాజగోపాల్రెడ్డి నిరసన ప్రయత్నంతో ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బీజేపీ నాటకాలు ఇప్పటితోనే అయిపోవని, రేపు అనారోగ్య కారణాలతో రాజగోపాల్రెడ్డి హాస్పిటల్లో చేరుతారన్నారు. వెంటనే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి సోదరుడికి పరామర్శ పేరుతో సానుభూతి డ్రామాలు చేస్తారని ఆరోపించారు. కోవర్టు రెడ్డి బ్రదర్స్ కొత్త డ్రామాలకు తెరలేపుతున్నారని, ఓటర్ల సానుభూతి కోసం చిల్లర నాటకాలు వేస్తున్నారని, వీటిని మనుగోడు ప్రజలు గమనించాలని విజ్ఞప్తి చేశారు.