నల్లగొండ : కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం కరువు కాటకాలకు నెలువయింది. నల్లగొండ నిజాం కాలంలోనే జిల్లాగా ఉంది. ఇప్పుడు నల్లగొండ అద్భుత పూల వనంగా మారిందని విద్యుత్ శాఖ మంత్రి జగదీష్ రెడ్డి అన్నారు. నల్లగొండలో మంత్రి కేటీఆర్తో కలిసి ప్రగతి నివేదన సభలో మంత్రి జగదీష్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..సీఎం కేసీఆర్ దత్తత తీసుకోవడంతో నల్లగొండ నగరం పునర్నిర్మాణం జరిగిందని తెలిపారు. కోట్లాది రూపాయల నిధులు కేటాయిస్తూ జిల్లా అభివృద్ధికి ఎంతో సహకరించారని పేర్కొన్నారు.
కాంగ్రెస్ పార్టీ దేశాన్ని అన్ని విధాల మోసం చేసింది. చివరికి దళితులను కూడా మోసం చేసిన దరిద్రులు కొంగ్రెసోళ్లు అని మండిపడ్డారు. తెలంగాణ వచ్చాక వరుసగా 18సార్లు పంటలకు నీళ్లిచ్చినం. ఏబీసీడీలు రాకపోయినా ఐటీ శాఖ మంత్రిగా కోమటిరెడ్డి కోతలు కోసిండు అని ఎద్దేవా చేశారు. దొంగ సర్టిఫికెట్లతో కాలం గడిపి పోయిండు తప్పా ప్రజలకు చేసింది శూన్యమన్నారు.
బీఆర్ఎస్ ఎమ్మెల్యలు, మంత్రులు రోజుకు 18గంటలు పని చేస్తున్నారు. ఐటీ రంగంలో ప్రపంచ స్థాయి గుర్తింపు తెలంగాణకు వచ్చింది. దేశాన్ని పరిపాలించే సత్తా కేసీఆర్, కేటీఆర్కు ఉందని మంత్రి తెలిపారు. ఎన్నికలు ఎప్పుడు వచ్చినా జిల్లాలో 12మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలుస్తారని స్పష్టం చేశారు.