సూర్యాపేట : బీజేపీ నాయకురాలు పాల్వాయి రజిని కుమారి కుటుంబ సభ్యులను శుక్రవారం విద్యుత్ శాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి(Minister Jagadish Reddy)పరామర్శించారు. ఇటీవల అనారోగ్యంతో రజనీకుమారి ఏకైక కుమార్తె ఐశ్వర్య మృతి చెందారు. ఏకైక కుమార్తెను కోల్పోయి పుట్టెడు దుఃఖంలో ఉన్న రజనికుమారితో పాటు ఆమె కుటుంబ సభ్యులను పరామర్శించిన మంత్రి ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు.
దురదృష్ట సంఘటనకు సంబంధించిన వివరాలను రజనికుమారిని అడిగి తెలుసుకున్నారు. మంత్రి వెంట ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, నిమ్మల శ్రీనివాస్ గౌడ్, ఉప్పల ఆనంద్, బండారు రాజా, మతకాల చలపతిరావు, అయూబ్ ఖాన్, చింతలపాటి చిన్న శ్రీరాములు, మద్ధి శ్రీనివాస్ యాదవ్, బైరు వెంకన్న గౌడ్ తదితరులు పాల్గొన్నారు.