హైదరాబాద్: మంత్రి జగదీశ్ రెడ్డి (Minister Jagadish Reddy) పుట్టినరోజును పురస్కరించుకుని ఉమ్మడి నల్లగొండ (Nalgonda) జిల్లా ప్రజాప్రతినిధులు వేడుకలను ఘనంగా నిర్వహించారు. సోమవారం అర్ధరాత్రి హైదరాబాద్లోని మంత్రి నివాసానికి చేరుకున్న జిల్లా ఎంపీలు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులు మంత్రితో కేక్ కట్ చేయించారు. అనంతరం ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.
ఈ కార్యక్రమంలో శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ బడుగుల లింగయ్య యాదవ్, ఎమ్మెల్యేలు శానంపూడి సైదిరెడ్డి, బొల్ల మల్లయ్య యాదవ్, గొంగిడి సుని, పైళ్ల శేఖర్ రెడ్డి, కంచర్ల భూపాల్ రెడ్డి, రవీంద్ర నాయక్, కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, నోముల భగత్, భాస్కర్ రావు, చిరుమర్తి లింగయ్య, గాదరి కిశోర్, ఎమ్మెల్సీ శానంపూడి సైదిరెడ్డి, నల్లగొండ జెడ్పీ చైర్మన్ బంద నరేందర్ రెడ్డి ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.