హైదరాబాద్ : అసెంబ్లీ ఆవరణలోని టీఆర్ఎస్ ఎల్పీ కార్యాలయంలో రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి బర్త్ డే వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ వేడుకల్లో సరదా సన్నివేశం చోటు చేసుకుంది. మంత్రి పుట్టిన రోజు వేడుకల వార్తను కవరేజ్ చేసేందుకు వచ్చిన పలువురు జర్నలిస్టులు కూడా జగదీశ్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం కేక్ కట్ చేయిస్తూ ఫోటో ఎవరూ తీస్తారా అని జర్నలిస్టులు అటుఇటు చూశారు. అయితే అక్కడే ఉన్న మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి.. ఈ విషయాన్ని గమనించారు. మీరు మా ఫోటోలు ఎప్పుడూ తీస్తారు కదా.. ఈ సారి నేను మీ ఫోటోలు తీస్తాను అంటూ కెమెరాలో క్లిక్ మనిపించారు. దీంతో అక్కడ సరదాగా నవ్వులు పూశాయి.