ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వం, ముఖ్యమంత్రిపై గవర్నర్ ఈ తరహా వ్యాఖ్యలు చేయడం బాధాకరమని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పేర్కొన్నారు. రాజ్యాంగ పదవిలో ఉన్న గవర్నర్ రాజకీయ విమర్శలు చేయడం తగదని గురువారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రభుత్వ విధానాలతో గవర్నర్ ఏకీభవించాలని లేదని.. అయితే ప్రశ్నించే అధికారం మాత్రం ఆమెకు లేదన్నారు.
సీఎం కేసీఆర్ గొప్ప రాజనీతిజ్ఞుడని, రాజ్యాంగబద్ధ పదవుల్లో ఉన్న వారిని ఎలా గౌరవించాలో ఆయనకు తెలుసని మంత్రి ఇంద్రకరణ్రెడ్డి చెప్పారు. రాజ్యాంగ నిబంధనలను ఉల్లంఘించి గవర్నర్ పదే పదే రాజకీయాలు మాట్లాడుతూ… ఓ పార్టీకి లబ్ధి చేకూరే ప్రయత్నాలు చేస్తున్నారన్నారు. ఇకనైనా రాజకీయాల్లో జోక్యం చేసుకోడం మానుకోవాలని హితవుపలికారు.