నిజామాబాద్, జూలై 22: పోచంపహాడ్ శ్రీరాం సాగర్ జలాశయాన్ని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. ఇన్ ఫ్లో, అవుట్ ఫ్లో వివరాలను ఇరిగేషన్ అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. ఎగువన కురుస్తున్న భారీ వర్షాల వల్ల ఊహించని రీతిలో ప్రాజెక్ట్ లోకి వరద నీరు వచ్చి చేరుతుందని, ప్రస్తుతానికి ఆందోళన చెందాల్సిన అవసం లేదన్నారు.
వరదలు పెరిగే అవకాశం ఉన్నందున ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఆదేశించారు. మంత్రి వెంట నిర్మల్ కలెక్టర్ ముష్రఫ్ అలీ ఫారూఖీ, నాందేడ్ కలెక్టర్ డా. విపిన్ ఇతంకర్, తదితరులు ఉన్నారు.