హైదరాబాద్, ఏప్రిల్ 30 (నమస్తే తెలంగాణ): గ్రేటర్ హైదరాబాద్ పరిధిలోని హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ మల్కాజిగిరి, సంగారెడ్డి తదితర నాలుగు జిల్లాల్లోని మరో 100 ఆలయాల్లో ధూప దీప నైవేద్య పథకం అమలుకానున్నది.
దేవాదాయ, ధర్మాదాయశాఖ మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదివారం నూతన సచివాలయం 4వ అంతస్థులోని తన చాంబర్లో ఆదివారం ఇందుకు సంబంధించిన ఫైల్పై తొలి సంతకం చేశారు. ప్రధాన దేవాలయాల్లో భక్తులకు మిల్లెట్ ప్రసాదాన్ని అందించే ఫైల్పై కూడా సంతకం చేశారు.