Minister Indrakaran Reddy | బీఆర్ఎస్ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పార్టీ శ్రేణులకు మంత్రి ఇంద్రకరణ్రెడ్డి పిలుపునిచ్చారు. నిర్మల్ జిల్లా ఇన్చార్జి గంగాధర్గౌడ్, బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు విఠల్రెడ్డితో కలిసి నర్సాపూర్ మండల కేంద్రంలో నిర్వహించిన బీఆర్ఎస్ ఆత్మీయ సమ్మేళనంలో మంత్రి పాల్గొన్నారు. సమన్వయంతోపాటు మరింత బలోపేతమే లక్ష్యంగా పార్టీ శ్రేణులందరినీ భాగస్వామ్యం చేసేలా కార్యాచరణ ఉండాలన్నారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. బీఆర్ఎస్ హ్యాట్రిక్ విజయం సాధించేలా ప్రతి ఒక్కరూ కృషి చేయాలన్నారు.
కార్యక్రమంలో ముధోల్ ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, జిల్లా పరిషత్ చైర్పర్సన్ కొరిపెల్లి విజయలక్ష్మి రెడ్డి, మాజీ ఎమ్మెల్యే నల్లా ఇంద్రకరణ్ రెడ్డి, జిల్లా రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు నల్లా వెంకట్రామ్ రెడ్డి, జిల్లా గ్రంథాయల సంస్థల చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, నిర్మల్ మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, ఎఫ్ఎస్సీఎస్ చైర్మన్ ధర్మాజీ రాజేందర్, మార్కెట్ కమిటీ చైర్మన్లు చిలుక రమణ, ఆశ్రిత రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి ముడుసు సత్యనారాయణ, బీఆర్ఎస్ మండల కన్వీనర్ రాజేశ్వర్, బీఆర్ఎస్ నాయకులు అల్లోల గౌతంరెడ్డి, అల్లోల సురేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.