నిర్మల్ : వర్షాలకు దెబ్బతిన్న రోడ్లకు మరమ్మతులు చేపట్టాలని మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి అధికారులను ఆదేశించారు. ముధోల్ నియోజకవర్గంలోని టాక్లి, బిద్రెల్లి, కిర్గుల్ గ్రామాల్లో పర్యటించారు. ఎమ్మెల్యే విఠల్రెడ్డి, కలెక్టర్ ముషరఫ్ అలీ ఫారూఖీతో కలిసి పర్యటించారు. ముంపు బాధితులతో మాట్లాడి, సాధకబాధకాలను తెలుసుకున్నారు. దెబ్బతిన్న డ్రైనేజీలు, రోడ్లను క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఆయా రహదారుల మరమ్మతులకు చేపట్టాల్సిన చర్యలపై అధికారులతో చర్చించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. వర్షాలతో జిల్లాలో పలు ఆర్అండ్బీ, పంచాయతీ రోడ్లు దెబ్బతిన్నాయన్నారు. ప్రజలకు మెరుగైన రవాణా వ్యవస్థ కల్పించే దిశలో వెంటనే క్షేత్రస్థాయిలో అధికారులు తనిఖీలు నిర్వహించి, కొన్ని రహదారుల్లో మరమ్మతులు చేపట్టాలని ఆదేశించామని తెలిపారు.