భద్రాద్రి: భద్రాచల (Bhadrachalam) శ్రీ సీతారామచంద్రమూర్తిని రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) దర్శించుకున్నారు. సతీసమేతంగా భద్రాద్రి ఆలయానికి చేరుకున్న మంత్రి.. ప్రధాన ఆలయంలో శ్రీసీతారామచంద్ర స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు వేదాశీర్వచనం, తీర్థప్రసాదాలు అందించారు. ఆ తర్వాత భక్తులకు తాగునీటి కోసం ఏర్పాటు చేసిన జలప్రసాదాన్ని (ఆర్వో ప్లాంట్) మంత్రి ప్రారంభించారు. అంతకుము ఆలయం వద్ద మంత్రికి ఆలయ అర్చకులు, అధికారులు పూర్ణకుంభంతో స్వాగతంపలికారు.
దక్షిణ అయోధ్యగా పేరుగాంచిన భద్రాచలం పుణ్యక్షేత్రంలో రాములోరి కల్యాణ క్రతువులో ఆ మూడు రోజులే కీలక ఘట్టాలు. అలాంటి మధుర ఘట్టాలను తిలకించడానికి తెలంగాణ సర్కారు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. ఈ నెల 30న జరగనున్న రామయ్య కల్యాణానికి వేదికను ముస్తాబు చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి భక్తులు రాములోరి కల్యాణాన్ని తిలకించేందుకు తరలి రానున్నారు.