కుమ్రం భీం ఆసిఫాబాద్ : జిల్లా కేంద్రంలోని గిరిజన బాలికల సంక్షేమ పాఠశాలను అటవీ, పర్యావరణ శాఖ మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు.
విద్యార్థులతో కలిసి భోజనం చేశారు.
పాఠశాల అంతటా కలియ తిరిగి విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. వంట గదిని, భోజనశాలను పరిశీలించారు. కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా గురుకులాల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు.
ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను విద్యార్థులు సద్వినియోగం చేసుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలని మంత్రి సూచించారు. మంత్రి వెంట జడ్పీ చైర్ పర్సన్ కోవా లక్ష్మి, ఎమ్మెల్యేలు కోనేరు కోనప్ప, ఆత్రం సక్కు, తదితరులు ఉన్నారు.