నిర్మల్ : ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 4న నిర్మల్ జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ఎల్లపల్లి శివారు క్రషర్ రోడ్ లో నిర్వహించే బహిరంగ సభ ఏర్పాట్లను గురువారం మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. బహిరంగ సభ వేదిక, ట్రాఫిక్, పార్కింగ్, హెలిప్యాడ్ ప్రాంతాలను సందర్శించి రూట్ మ్యాప్ ను పరిశీలించారు. భద్రత, బందోబస్తు ఏర్పాట్లపై పోలీస్ అధికారులతో చర్చించారు. సభ ఏర్పాట్లను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు.
మంత్రి వెంట ఎమ్మెల్యే విఠల్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థల చైర్మన్ ఎర్రవోతు రాజేందర్, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, మార్కెట్ కమిటీ చైర్మన్ చిలుక రమణ, ఇతర అధికారులు, రాంకిషన్ రెడ్డి, అల్లోల గౌతమ్ రెడ్డి, ప్రజాప్రతినిధులు ఉన్నారు.