Nirmal | నిర్మల్ జిల్లా కేంద్రంలోని రూరల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన సీసీ కెమెరాల కమాండ్ కంట్రోల్ రూమ్ను మంత్రి ఇంద్రకరణ్రెడ్డి ఆదివారం ప్రారంభించారు. కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ సీహెచ్ ప్రవీణ్ కుమార్ పాల్గొన్నారు. అంతకు ముందు ఠాణా ఆవరణలో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా సీసీ కెమెరాల పనితీరును పర్యవేక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఒక్క సీసీ కెమెరా వంద మంది పోలీసులతో సమానమన్నారు. దేశంలోనే అతిపెద్ద కమాండ్ కంట్రోల్ను సీఎం కేసీఆర్ నేతృత్వంలో హైదరాబాద్లో ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పట్టణంలో సీసీ కెమెరాలు ఏర్పాటుతో దొంగతనాలకు ఆస్కారం లేదన్నారు.
ఇటీవల నిర్మల్ చుట్టుపక్కల ఓ బ్యాంకులో దొంగతనం జరిగితే పోలీసులు ఐదు రోజుల్లో ఛేజ్ చేశారన్నారు. పట్టణంలో ఏం అనర్థాలు జరుగుతున్నాయో, సీసీ కెమెరాలతో పోలీసులకు వెంటనే తెలిసిపోతాయన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతయుతంగా ఉండి పోలీసులకు సహకరించాలని సూచించారు. అనుమాదాస్పద వ్యక్తులు కనబడినా, సంఘ వ్యతిరేక చర్యలు జరుగుతున్నాయని తెలిసినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. కార్యక్రమంలో మాజీ డీసీసీబీ చైర్మన్ రాంకిషన్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ గండ్రత్ ఈశ్వర్, బీఆర్ఎస్ నాయకులు అల్లోల గౌతమ్ రెడ్డి, పట్టణ అధ్యక్షుడు మారుగొండ రాము, డీఎస్పీ జీవన్ రెడ్డి, సీఐలు మల్లేశ్, శ్రీనివాస్, ట్రాఫిక్ సీఐ దేవేందర్, రాజశేఖర్ పాల్గొన్నారు.