నిర్మల్ చైన్గేట్, నవంబర్ 24 : ఏ ముఖం పెట్టుకొని ప్రధాని మోదీ ఆదివారం నిర్మల్ జిల్లాకు వస్తున్నారని దేవాదాయ శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్రెడ్డి ప్రశ్నించారు. శుక్రవారం అల్లోల ఎన్నికల ప్రచారం నిర్వహించిన సందర్భంగా నిర్మల్కు వస్తున్న మోదీకి పలు ప్రశ్నలు సంధించారు. నిర్మల్ నియోజకవర్గ అభివృద్ధికి రూపాయి అయినా ఖర్చు చేశారా? బీజేపీ వల్ల పైసా లాభం అయిందా? నిర్మల్కు రైల్వే లైన్ ఏమైంది? నవోదయ స్కూల్ ఏమైంది? దక్షిణ భారత దేశంలో ఉన్న ఏకైక సరస్వతీ అమ్మవారి ఆలయ అభివృద్ధికి ప్రసాద్ స్కీం కింద నిధులు కేటాయించాలని ప్రతిపాదనలు పంపితే బుట్టదాఖలు చేసిన మాట వాస్తవం కాదా? ప్రశ్నించారు. ఓట్ల కోసం కాకుండా నిర్మల్ అభివృద్ధి పనుల శంకుస్థాపన చేయడానికి వస్తే ఘనంగా స్వాగతం పలికే వారిమని మంత్రి పేర్కొన్నారు.