నిర్మల్ : వరల్డ్ సైక్లింగ్ దినోత్సవం సందర్భంగా నిర్మల్ లో నిర్వహించిన సైకిల్ ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పాల్గొన్నారు. జిల్లా అధికారులు, స్థానికులతో కలిసి ఇంద్రకరణ్ రెడ్డి 15 కిలోమీటర్ల మేర సైకిల్ తొక్కి అందర్నీ ఆశ్చర్యపరిచారు.
ఈ సందర్భంగా మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి మాట్లాడుతూ.. ప్రతి రోజూ సైకిల్ తొక్కి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలన్నారు. పర్యావరణాన్ని కూడా సంరక్షించుకోవాలి మంత్రి తెలిపారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు సైకిల్ తొక్కడం అలవాటు చేయాలని సూచించారు. పిల్లలకు మానసిక ఎదుగుదలతో పాటు శారీరక ఉల్లాసం కలుగుతుందని ఇంద్రకరణ్ రెడ్డి పేర్కొన్నారు.
ప్రపంచ సైకిల్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఎన్సీసీ, నిర్మల్ సైక్లింగ్ క్లబ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సైకిల్ ర్యాలీని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం 15.5 కిలోమీటర్ల ర్యాలీలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ఉత్సాహంగా పాల్గొని సైకిల్ తొక్కారు. pic.twitter.com/rEVmeFwib8
— Namasthe Telangana (@ntdailyonline) June 3, 2022