నిర్మల్, ఆగష్టు, 11: రాఖీ పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని రాష్ట్ర ప్రజలకు అటవీ, పర్యావరణ, శాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. అన్నా, చెల్లెళ్లు, అక్కా తమ్ముళ్ల మధ్య అనుబంధం, ఆప్యాయతకు ప్రతిరూపం రక్షాబంధన్ అని ఆయన అన్నారు.
రాఖీ పౌర్ణమి సందర్భంగా మంత్రి ఇంద్రకరన్రెడ్డికి ఆయన సోదరిమణులు రాఖీలు కట్టి..మిఠాయిలు తినిపించారు. తోబుట్టువులు మధ్య రాఖీ పండగ జరుపుకోవటం సంతోషంగా ఉందని మంత్రి తెలిపారు.