నిర్మల్: పదో తరగతి ఫలితాల్లో నిర్మల్ (Niramal) జిల్లా విద్యార్థులు తిరుగులేని ప్రతిభను కనబరిచారు. 99 శాతం ఉత్తీర్ణతలో రాష్ట్రంలోనే నిర్మల్ జిల్లా మొదటి స్థానం దక్కించుకున్నది. ఈ నేపథ్యంలో మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran reddy) సంతోషం వ్యక్తం చేశారు. విద్యార్థులకు శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా కలెక్టర్, జిల్లా విద్యాధికారి, ఇతర అధికారులు, ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బంది, విద్యార్థులను మంత్రి అభినందించారు. ఇదే ఉత్సాహంతో పనిచేసి మరిన్ని ఉత్తమ ఫలితాలు సాధించాలని కొరారు.
పదో తరగతి పరీక్ష ఫలితాను విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి (Sabitha Indra reddy) విడుదల చేశారు. ఈ ఫలితాల్లో 86.80 శాతం ఉత్తీర్ణత నమోదయింది. బాలికలు బాలురకంటే 3.85 శాతం అధికంగా ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 88.53 శాతం ఉత్తీర్ణత నమోదు సాధించగా, బాలురు 84.68 శాతం ఉత్తీర్ణత సాధించారు. ఇక రాష్ట్రవ్యాప్తంగా 99 శాతం ఉత్తీర్ణతతో నిర్మల్ జిల్లా మొదటి స్థానంలో నిలవగా, 59.46 శాతంతో వికారాబాద్ జిల్లా చివరి స్థానంలో నిలిచింది. 2,793 పాఠశాలల్లో 100 శాతం, 25 స్కూళ్లలో సున్నా శాతం ఉత్తీర్ణత నమోదైంది.
Click Here: TS SSC RESULTS 2023