నిర్మల్: కండెం ప్రాజెక్టుపై (Kadem Project) సోషల్ మీడియాలో (Social media) వస్తున్న వదంతులను నమ్మొద్దని మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి (Minister Indrakaran Reddy) అన్నారు. ఇలాంటి వార్తలను సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయడం సమాజానికి అంత మంచిదికాదని సూచించారు. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద నీటి ప్రవాహం పోటెత్తిందని, దీంతో ప్రాజెక్టు స్థాయికి మించి వరద ప్రవాహం కొనసాగుతున్నదని చెప్పారు. ప్రస్తుతం 14 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేస్తున్నామన్నారు. 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని వెల్లడించారు. కడెం ప్రాజెక్టకు వస్తున్న వరద పరిస్థితిని ఎమ్మెల్యే రేఖా నాయక్, కలెక్టర్ వరుణ్ రెడ్డి, ఎస్పీ ప్రవీణ్ కుమార్, నీటిపారుదల శాఖ అధికారులతో కలిసి మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ.. కడెం ప్రాజెక్టుకు భారీగా వరద పోటెత్తిందన్నారు. ప్రాజెక్టు స్థాయికి మించి వరద నీటి ప్రవాహం కొనసాగుతున్నదని చెప్పారు. ప్రాజెక్టుకు వస్తున్న వరద నీటిని ప్రస్తుతం 14 గేట్లు తెరిచి ఎప్పటికప్పుడు వరద నీటిని కిందికి వదులుతున్నామని వెల్లడించారు.
ఒకేసారి లక్షల క్యూసెక్కులు వరద రావడంతో కడెం ప్రాజెక్టు గేట్ల పైనుంచి ప్రవాహం కొనసాతున్నదని చెప్పారు. ప్రాజెక్టుకు వస్తున్న వరద పరిస్థితిని స్వయంగా పరిశీలించామన్నారు. ప్రస్తుతం కడెం ప్రాజెక్టుకు కొద్దిగా వరద తగ్గినప్పటికీ.. ఎగువన భారీగా నీటి ప్రవాహం కొనసాగుతుండటంతో ప్రభుత్వం అధికారులను అప్రమత్తం చేసిందని వెల్లడించారు. ప్రాజెక్టు కింది భాగంలో ఉన్న 12 గ్రామాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామన్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాల వల్ల ఎదురయ్యే పరిస్థితులను అంచనా వేయడానికి జిల్లాల కలెక్టర్లు ఇప్పటికే అప్రమత్తమయ్యారని తెలిపారు. భారీవర్షాల నేపథ్యంలో ప్రజలు అవసరమైతే తప్పితే బయటకు రావద్దని, తగిన జాగ్రత్తలు తీసుకోవలన్నారు. కడెం ప్రాజెక్టుకు సంబంధించిన నాలుగు వరద గేట్ల మరమ్మత్తుల కోసం నిపుణుల కమిటీ చర్యలు చేపట్టిందని మంత్రి ఇంద్రకరణ్ చెప్పారు.
కడెం ప్రాజెక్టు ను మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి ,కలెక్టర్ వరుణ్ రెడ్డి గార్లు…తో సందర్శించి అధికారులతో సమీక్షించడం జరిగింది ప్రజలు ఎటువంటి భయభ్రాంతులకు గురి కాకుండా మేమున్నామన్న భరోసా కల్పించడం జరిగింది@BRSparty @KTRBRS @IKReddyAllola @Collector_NML pic.twitter.com/hBjH1AXUBO
— Ajmeera Rekha Shyam Naik (@RekhaNaikBRS) July 27, 2023