హైదరాబాద్, ఆగస్టు 31 (నమస్తే తెలంగాణ): బీఆర్ఎస్ పార్టీ ములుగు జిల్లా నూతన అధ్యక్షుడిగా నియమితులైన లక్ష్మీనరసింహారావు (ఏటూరునాగారం లక్ష్మణ్) ప్రగతిభవన్లో మం త్రులు హరీశ్రావు, ఎర్రబెల్లి దయాకర్రావు, సత్యవతిరాథోడ్ను గురువారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా మంత్రులు లక్ష్మణ్ను అభినందించారు. బీఆర్ఎస్ ములుగు నియోజకవర్గ అభ్యర్థి బడే నాగజ్యోతి గెలుపు కోసం సమన్వయంతో పనిచేయాలని మంత్రి హరీశ్రావు లక్ష్మణ్కు దిశానిర్దేశనం చేశారు.
ఎవరు ఎన్ని కుట్రలు చేసినా రాష్ట్రంలో బీఆర్ఎస్ మూడోసారి అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. పార్టీ బలోపేతానికి అందరినీ కలుపుకొని ముందుకు సాగాలని కోరారు. మంత్రులను కలిసివారిలో ములుగు జడ్పీ చైర్పర్సన్, బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి నాగజ్యోతితోపాటు పలువురు బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఉన్నారు.