Minister Harish Rao | హైదరాబాద్, ఆగస్టు 29 (నమస్తే తెలంగాణ): మహారాష్ట్రలోని సోలాపూర్లో పద్మశాలీల ఆరాధ్య దైవం మారండేయ రథోత్సవ కార్యక్రమం బుధవారం ఘనంగా జరగనున్నది. తెలంగాణ నుంచి వెళ్లి సోలాపూర్లో స్థిరపడిన పద్మశాలీల ఆధ్వర్యంలో పెద్దఎత్తున జరగనున్న రథోత్సవంలో రాష్ట్రం తరఫున పలువురు మంత్రులతోపాటు బీఆర్ఎస్ ముఖ్య నేతలు పాల్గొననున్నారు.
బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు, ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్రావు ఆదేశాల మేర కు మంత్రి హరీశ్రావు ఆధ్వర్యంలో హోం మంత్రి మహమూద్అలీ, ఎమ్మెల్సీ ఎల్ రమణ, మహారాష్ట్ర బీఆర్ఎస్ ఇన్చార్జి కల్వకుంట్ల వంశీధర్రావు తదితరులు హాజరు కానున్నారు. కాగా, ఈ పర్యటనలో బీఆర్ఎస్ పార్టీ త్వరలో జరుపతలపెట్టిన భారీ బహిరంగ సభా స్థలాన్ని మంత్రి హరీశ్రావు నేతృత్వంలోని బృందం పరిశీలించనున్నది.