శ్రీశైలం : తెలంగాణ ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు దంపతులు శ్రీశైల మహాక్షేత్రంలోని భ్రమరాంబ సమేత మల్లికార్జున స్వామివారలను సోమవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మంత్రికి ప్రధానగోపురం వద్ద దేవస్థాన అధికారులు ఘన స్వాగతం పలికారు. అనంతరం మంత్రి స్వామి అమ్మవార్లను దర్శించుకొని, ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం వేదపండితులు ఆశీర్వచనం చేయగా.. ఆలయ అధికారులు తీర్థ ప్రసాదాలు అందజేశారు.