జహిరాబాద్ : న్యాల్కల్ మండలం రేజింతల్ గ్రామంలో కొలువైన సిద్ధి వినాయకుడిని రాష్ట్ర ఆర్థిక, వైద్యారోగ్యశాఖ మంత్రి హరీశ్రావు దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయానికి వచ్చిన మంత్రికి అర్చకులు ఘన స్వాగతం పలికారు. అనంతరం ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు.
అనంతరం ఆయన మాట్లాడుతూ ఈ రోజు చాలా ప్రత్యేకమైన రోజనీ, స్వయంభూ వినాయకుడిని దర్శించుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆలయ అభివృద్ధికి రూ.50లక్షల విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. ఎలాంటి విజ్ఞాలు ఉన్నా తొలగిపోయి.. సీఎం కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలంతా సుఖ సంతోషాలతో ఉండాలని కోరుకున్నట్లు మంత్రి తెలిపారు.