జోగులాంబ గద్వాల : రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు బుధవారం జోగులాంబ గద్వాల జిల్లాలో పర్యటించారు. పర్యటనలో భాగంగా మల్దకల్లో శ్రీ స్వయంభూ లక్ష్మీ వేంకటేశ్వర స్వామిని మంత్రి హరీశ్రావు దర్శించుకున్నారు. ప్రస్తుతం ఆ ఆలయంలో బ్రహ్మోత్సవాలు కొనసాగుతున్నాయి. ఈ సందర్భంగా బండ లాగుడు పోటీలను హరీశ్రావు ప్రారంభించారు. అంతకుముందు జోగులాంబ గద్వాల్ జిల్లాలో 300 పడకల జిల్లా ఆస్పత్రి, నర్సింగ్ కాలేజీ, మల్దకల్ మండలంలో ఆరోగ్య ఉప కేంద్రం నిర్మాణానికి హరీశ్రావు శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ రాములు, ఎమ్మెల్యేలు కృష్ణమోహన్ రెడ్డి, అబ్రహం, ఆల వెంకటేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీలు సురభి వాణి దేవి, దామోదర్ రెడ్డి, కసిరెడ్డి నారాయణరెడ్డి, జడ్పీ చైర్ పర్సన్ సరిత తిరుపతయ్య తదితరులు పాల్గొన్నారు.