హుజూరాబాద్ : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న దళిత బంధు కార్యక్రమాన్ని హుజూరాబాద్ నియోజకవర్గం వేదికగా ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెల 16న లాంఛనంగా ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గంలోని శాలపల్లి ( ఇందిరా నగర్) లో సీఎం బహిరంగ సభాస్థలిని మంత్రులు హరీశ్రావు, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్ గురువారం ఉదయం పరిశీలించారు.
అనంతరం అధికారులతో సభా ఏర్పాట్లపై మంత్రులు సమీక్షించారు. సభా నిర్వహణకు సంబంధించి అధికారులకు మంత్రి హరీశ్రావు పలు సూచనలు చేశారు. ఇక టీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా విద్యార్థి నాయకుడు గెల్లు శ్రీనివాస్ యాదవ్ను కేసీఆర్ ప్రకటించిన విషయం విదితమే.