హైదరాబాద్ : కేవలం 24 గంటల్లోనే నలుగురికి మూత్రపిండాల శస్త్ర చికిత్సలను విజయవంతం చేసిన నిమ్స్ వైద్యులను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు అభినందించారు. ఈ మేరకు హరీశ్రావు ట్వీట్ చేశారు. చివరి దశలో ప్రాణాలతో పోరాడుతున్న రోగులకు కిడ్నీ సర్జరీలు చేసి ప్రాణాలు కాపాడిన వైద్యులకు శుభాకాంక్షలు తెలిపారు. ప్రయివేటు ఆస్పత్రుల్లో ఒక్కో సర్జరీకి రూ. 10 లక్షల నుంచి రూ. 15 లక్షలు అయ్యే ఖర్చును నిమ్స్లో ప్రభుత్వం ఆరోగ్య శ్రీ కింద ఉచితంగా చేసిందని హరీశ్రావు పేర్కొన్నారు.
These surgeries which wud cost Rs 10 to 15 lakhs per transplant in private were done free of cost at NIMS hospital under Aarogyasree scheme provided by govt of Telangana #CMKCR #ArogyaTelangana
— Harish Rao Thanneeru (@trsharish) December 21, 2022