హైదరాబాద్, ఏప్రిల్ 27 (నమస్తే తెలంగాణ) : వేసవి నేపథ్యంలో ప్రయాణికుల కోసం 40 ప్రత్యేక రైళ్లు ఏర్పాటు చేసినట్టు రైల్వే అధికారులు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ నెల 30 నుంచి జూలై 2 వరకు షెడ్యూల్ వారీగా బిలాస్పూర్-యశ్వంత్పూర్, తిరుపతి-శ్రీకాకుళం రోడ్, కొచ్చువెలి-భరణి రైల్వే స్టేషన్ల మధ్య ప్రత్యేక రైళ్లు నడుస్తాయని వెల్లడించారు.