హైదరాబాద్: తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహా రావు అని మంత్రి హరీశ్ రావు అన్నారు. మాజీ ప్రధాని పీవీ జయంతి సందర్భంగా హరీశ్ రావు ఘనంగా నివాలుళర్పించారు. పాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా పీవీ ప్రజ్ఞ అమోఘమని చెప్పారు. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారతదేశానికి శ్రీకారం చుట్టారన్నారు. ఆ మహనీయుని శతజయంతి సందర్భంగా పీవీని ఘనంగా స్మరించుకుందామని ట్వీట్ చేశారు.
‘తెలంగాణ నేల సృష్టించిన అద్భుత మేధస్సు పీవీ నరసింహా రావు గారు. ఆలోచనాపరునిగా, సాహితీ వేత్తగా, బహు భాషా కోవిదునిగా, పరిపాలనా దక్షుడిగా, రాజనీతిజ్ఞుడిగా ఆయన చూపిన ప్రజ్ఞ అమోఘం, అనితర సాధ్యం. ఆర్థిక సంస్కరణలతో ఆధునిక భారత దేశానికి శ్రీకారం చుట్టిన ఘనత ఆయనదే. ఆ మహానీయుని శతజయంతి సందర్భంగా తెలంగాణ ఠీవీ.. మన పీవీని ఘనంగా స్మరించుకుందాం. ఘన నివాళులు అర్పిద్దాం’ అని ట్విట్టర్లో పోస్టు చేశారు.