హైదరాబాద్: అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు కొనసాగుతున్నాయి. నేడు ఉభయ సభల్లో బడ్జెట్పై చర్చ జరుగనున్నది. ఉదయం 10 గంటలకు ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. 2023-24కు సంబంధించిన వార్షిక బడ్జెట్ను మంత్రి హరీశ్ రావు సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. దీంతో బడ్జెట్పై శాసన మండలి, శాసనసభలో సాధారణ చర్చ జరుగనుంది. ఈ నేపథ్యంలో శాసనసభలో ప్రశ్నోత్తరాలను రద్దు చేశారు. నేరుగా బడ్జెట్పై చర్చ ప్రారంభం కానున్నది. బీఆర్ఎస్ నుంచి మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, విప్ గువ్వల బాలరాజు మాట్లాడనున్నారు. చర్చ అనంతరం ప్రభుత్వం సమాధానం మంత్రి హరీశ్ రావు సమాధానం ఇవ్వనున్నారు.
ఇక శాసనమండలిలో ఉదయం ప్రశ్నోత్తరాలను చేపట్టనున్నారు. అనంతరం బడ్జెట్పై చర్చ, ప్రభుత్వం సమాధానం ఉంటాయి. మన ఊరు-మన బడి, జంటనగరాల్లో సీసీటీవీ కెమెరాలు, ధాన్యం సేకరణ కేంద్రాలు, ట్రాఫిక్ నిర్వహణ, ఆసరా పింఛన్లు, నకిలీ విత్తనాలు-ఎరువుల వంటి తదితర అంశాలు మండలి ప్రశ్నోత్తరాల్లో ప్రస్తావనకు రానున్నాయి. కాగా, ఇటీవల మరణించిన మాజీ ఎమ్మెల్యేలు వెలిచాల జగపతిరావు, మందాడి సత్యనారాయణ రెడ్డి, గడ్డం రుద్రమదేవికి ఉభయ సభలు సంతాపం ప్రకటించనున్నాయి.