హైదరాబాద్, జూలై 21 (నమస్తే తెలంగాణ): ఉద్యోగులు, పెన్షనర్ల కోసం ఎంప్లాయీస్ హెల్త్ స్కీమ్ (ఈహెచ్ఎస్)ను మరింత పకడ్బందీగా అమలు చేస్తామని వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఈహెచ్ఎస్ పర్యవేక్షణకు ప్రత్యేకంగా కమిటీ ఏర్పాటు చేస్తామని చెప్పారు. టీఎన్జీవో గౌరవాధ్యక్షుడు దేవీప్రసాద్ ఆధ్వర్యంలో విశ్రాంత ఉద్యోగులు శుక్రవారం సచివాలయంలో మంత్రి హరీశ్రావును కలిశారు. ఈహెచ్ఎస్తోపాటు ఇతర సమస్యలను మంత్రి దృష్టికి తీసుకొచ్చారు.
ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. దేశంలోనే తెలంగాణ ప్రభుత్వం ఉద్యోగ ఫ్రెండ్లీ సర్కారుగా ఖ్యాతి గడించిందని తెలిపారు. ఉద్యోగులు, పెన్షనర్ల అన్ని రకాల సమస్యలు పరిషరించేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ సిద్ధంగా ఉన్నారని భరోసా ఇచ్చారు. ఈహెచ్ఎస్ ద్వారా ఎలాంటి అంతరాయం లేకుండా, అత్యున్నత వైద్యసేవలు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఉద్యోగులకు అత్యధిక వేతనాలు, పింఛన్లు అందిస్తూ ప్రభుత్వం ఇతర రాష్ర్టాలకు ఆదర్శంగా నిలిచిందని తెలిపారు. మంత్రి హరీశ్రావును కలిసినవారిలో రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ అధ్యక్షుడు దామోదర్రెడ్డి, జనరల్ సెక్రటరీ చంద్రశేఖర్, కోశాధికారి గంగారెడ్డి, పెన్షనర్ల జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య, నాయకులు పూర్ణచందర్రావు, నర్సింగరావు, ఎల్ శ్రీనివాస్రెడ్డి తదితరులు ఉన్నారు.