హైదరాబాద్ : రైతుల సంక్షేమం పట్ల టీఆర్ఎస్ ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉంది. రైతుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న కేసీఆర్ సర్కార్.. మరో శుభవార్త వినిపించింది. పంట రుణాల మాఫీపై ఇచ్చిన మాటను కేసీఆర్ నిలబెట్టుకున్నారు. రూ. 50 వేల లోపు పంట రుణాలను మార్చి లోపు మాఫీ చేస్తామని మంత్రి హరీశ్రావు తన బడ్జెట్ ప్రసంగంలో స్పష్టం చేశారు. వచ్చే ఆర్థిక సంవత్సరం రూ. 75 వేల లోపు సాగు రుణాలు మాఫీ చేస్తామని ప్రకటించారు. పంట రుణాల కింద ఇప్పటి వరకు మొత్తం రూ. 16,144 కోట్లు మాఫీ చేసినట్లు తెలిపారు.
రైతుబంధు పథకానికి రూ. 14,800 కోట్లు, రైతుబీమా పథకం కోసం రూ. 1,466 కోట్లు కేటాయిస్తున్నట్లు హరీశ్రావు చెప్పారు. పామాయిల్ సాగుకు రూ. 1000 కోట్లు కేటాయించారు. రాష్ట్రంలో 2.5 లక్షల ఎకరాల్లో ఆయిల్ పామ్ సాగు లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు.ఈ వార్షిక బడ్జెట్లో వ్యవసాయ రంగానికి మొత్తంగా రూ.24,254 కోట్లు కేటాయించారు.