సిద్దిపేట, నవంబర్ 19( నమస్తే తెలంగాణ ప్రతినిధి)/అందోల్: దీపావళి వెలుగులు ఇచ్చే బీఆర్ఎస్ కావాలా? కర్ణాటక మాడల్లో ఆర్థిక దివాలా కావాలా? అని ఆర్థిక, వైద్య ఆరోగ్యశాఖల మంత్రి హరీశ్రావు ప్రశ్నించారు. కర్ణాటక ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ఆర్నెళ్లకే ఆ రాష్ర్టాన్ని ఆర్థికంగా దివాళా తీయించిందని మండిపడ్డారు. కాంగ్రెస్కు ఎం దుకు ఓటు వేశామా? అని అక్కడి ప్రజలు బాధపడుతున్నారని చెప్పారు. తెలంగాణలో వ్యవసాయానికి 24 గంటల కరెంటు ఇస్తుంటే కర్ణాటకలో 3 గంటలే ఇస్తున్నారని వివరించారు. దీంతో అక్కడి రైతులు అష్టకష్టాలు పడుతున్నారని చెప్పారు. ఆదివారం ఆయన సిద్దిపేటలో తెలంగాణ గురుకుల పేరెంట్స్ అసోయేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా సిద్దిపేటలోని 21 అసోసియేషన్లు బీఆర్ఎస్కు సం పూర్ణ మద్దతు ప్రకటించాయి. బీజేపీ, కాంగ్రెస్కు చెందిన నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో బీఆర్ఎస్లో చేరారు. ఈ సందర్భంగా హరీశ్రావు మాట్లాడుతూ.. ‘సిద్దిపేట ప్రజల ప్రేమ, అభిమానం నా హృదయంలో పెట్టుకుంటా.. నా చివరి శ్వాస వరకు మీ సేవ లో ఉంటాను’ అని ఉద్వేగానికి లోనయ్యారు. సీఎం కేసీఆర్ అన్నివర్గాల గురించి ఆలోచించారని, ఆ కోణంలోనే రాష్ట్రాన్ని అభివృద్ధి చేశారని తెలిపారు. తాగు, సాగునీరు, కరెంటు కష్టాలు తొలగించిన నేత సీఎం కేసీఆర్ అని చెప్పారు. విద్యుత్తు రంగంలో తెలగాణను దేశంలోనే నంబర్ వన్గా నిలిపారన్నారు. సాగునీరు పుష్కలంగా ఉండటంతో రైతులు రెండు పంటలు పండిస్తున్నారని, ధాన్యం ఉత్పత్తిలోనూ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో ఉన్నదని వివరించారు. అద్భుతమైన మ్యానిఫెస్టోను బీఆర్ఎస్ విడుదల చేసిందని పేర్కొన్నారు. అభివృద్ధి కండ్ల ముందే కనపిస్తున్నదని, మరో సారి బీఆర్ఎస్ను గెలిపించాలని కోరారు.
ఒకప్పుడు ‘నేను రాను బిడ్డో సరారు దవాఖానకు’ అనేవారని, నేడు ‘పోదాం పద బిడ్డ సరారు దవాఖానకు’ అంటున్నారని హరీశ్రావు పేర్కొన్నారు. మోకాలుచిప్ప ఆపరేషన్లు ప్రభుత్వ దవాఖానల్లో ఇప్పటికే ప్రారంభించామని, వేల మందికి ఆరోగ్యశ్రీ కింద ఉచిత ఆపరేషన్లు నిర్వహించామని వెల్లడించారు. ఈ మాత్రం తెల్వనోళ్లు కాంగ్రెస్ మ్యానిఫెస్టోలో రాసుకున్నారని ఎద్దేవాచేశారు.
బట్టెబాజ్ కాంగ్రెస్ చేతుల్లో తెలంగాణ ఉండకూడదని హెచ్చరించారు. అప్పుడే పుట్టిన బిడ్డ తల్లి చేతు ల్లో ఉంటే ఎంత భద్రంగా ఉంటుందో సాధించుకున్న తెలంగాణ కేసీఆర్ చేతుల్లో ఉంటే అంత భద్రంగా ఉంటుందని చెప్పారు. మొదటి ఐదేండ్ల పాలనలో వ్యవసాయం, కరెంటు, సాగు, తాగునీటి సమస్యలు తీర్చి, రాష్ర్టాన్ని అన్నపూర్ణగా కేసీఆర్ మార్చారని వివరించారు.
రెండోసారి విద్య, వైద్యంపై దృష్టి సారించారని పేర్కొన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 290గా ఉన్న గురుకులాల సంఖ్యను 1000కి పెంచారని చెప్పారు. నాడు గురుకులాల్లో లక్షా 90వేల విద్యార్థులుంటే, నేడు 6 లక్షల మంది చదువుకొంటున్నారని తెలిపారు. విద్యపై చేసే ఖర్చును పెట్టుబడి వ్యయంగా భావిస్తున్నామని చెప్పా రు. 119 నియోజకవర్గాల్లో అగ్రవర్ణ పేద పిల్లలకు గురుకులాలు ఏర్పాటుచేస్తామన్నారు.
తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ అసోసియేషన్, తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ ఫెడరేషన్, ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్స్ ఫెడరేషన్, సిద్దిపేట జిల్లా అడ్వకేట్ సొసైటీ, తెలంగాణ ప్రైవేట్ ఎలక్ట్రికల్ టెక్నీషియన్ ఫెడరేషన్, గజ్వేల్ ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్, దుబ్బాక మండల ఎలక్ట్రీషియన్ వరర్స్ అసోసియేషన్, సిద్దిపేట ప్రైవేట్ ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్, సిద్దిపేట ప్రశాంత్నగర్ హౌస్వైరింగ్, ఎలక్ట్రీషియన్స్ అసోసియేషన్, న్యూఫ్రెండ్స్ ఆటో మెకానిక్ అసోసియేషన్ సిద్దిపేట, తెలంగాణ మీ-సేవ సిద్దిపేట అసోసియేషన్, తెలంగాణ కాకిపడగల యువజన సం ఘం, యాదవ హకుల పోరాట సమితి సిద్దిపేట, తెలంగాణ రాష్ట్ర గురుకుల పేరెంట్స్ అసోసియేషన్, ఎన్జీవోస్ కాలనీ సంక్షేమ సంఘం, ప్రశాంత్నగర్ సిద్దిపేట, సంతోష్నగర్ మెంబర్స్ అసోసియేషన్, ప్రశాంత్నగర్ ఆర్యవైశ్య సం ఘం, గ్రీన్ల్యాండ్ మెంబర్స్ అసోసియేషన్-సిద్దిపేట, పవనసుత యూత్ అసోసియేషన్, ప్రజాసేవ సమితి-సిద్దిపేట, సిద్దిపేట ఓల్డ్ ఐరన్ సెల్లర్స్ అసోసియేషన్, పెయింటింగ్స్ అసోసియేషన్-సిద్దిపేట.
ఎన్నికల్లో బీఆర్ఎస్కు టీఎమ్మార్పీఎస్ సం పూర్ణ మద్దతు ప్రకటించింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వంగపల్లి శ్రీనివాస్, గుర్రాల శ్రీనివాస్, డప్పు శివ, రాజేందర్, సిద్దిపేట టీఎమ్మార్పీఎస్ కార్యవర్గ సభ్యులు హరీశ్రావును కలిసి మద్దతు తెలియజేశారు. ఈ సందర్భంగా మం త్రి మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణకు బీఆర్ఎస్ కట్టుబడి ఉన్నదని చెప్పారు. రాష్ట్రం ఏర్పడ్డ మొదట్లోనే అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి కేంద్రానికి పంపామని గుర్తుచేశారు. తొమ్మిదేం డ్లు నానబెట్టి ఎన్నికల వేళ కేంద్రం కొత్త కమి టీ అని చెప్తున్నదని విమర్శించారు. కమిటీ కాదు బిల్లు పెట్టాలని డిమాండ్ చేశారు. జాతీయ రాజకీయాల్లో బీఆర్ఎస్ కీల కపాత్ర పోషిస్తుందని, వర్గీకరణ చేసి తీరుతామని చెప్పారు.
సిద్దిపేట నియోజకవర్గానికి చెందిన పలువురు కాంగ్రెస్, బీజేపీ నేతలు మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్ పార్టీలో చేరారు. బీజేపీ సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షుడు బాలకృష్ణారెడ్డి, రాష్ట్ర ఓబీసీ జనరల్ సెక్రటరీ ఉడుత మల్లేశం, భజరంగదళ్ జిల్లా అధ్యక్షుడు బయ్యారం కమలాకర్రెడ్డి, సిద్దిపేట మండల బీజేపీ కార్యదర్శి విజయ్, తీన్మార్ మల్లన్న టీమ్ జిల్లా కన్వీనర్ మోత్కు సాయికుమార్, పట్టణ కాంగ్రెస్ మహిళా అధ్యక్షురాలు స్వప్న, పురుమాండ్ల వెంకట్రెడ్డి, అవినాశ్రెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, సామల్ల నరేందర్రెడ్డి తదితరులు బీఆర్ఎస్లో చేరారు. వారందరికీ మంత్రి హరీశ్రావు గులాబీ కండువా కప్పి బీఆర్ఎస్లోకి స్వాగతించారు.
సంగారెడ్డి జిల్లా అందోల్ నియోజవర్గ బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి బాబూమోహన్ కుమారుడు ఉదయ్ బాబూమోహన్ బీఆర్ఎస్ అభ్యర్థి, ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనతోపాటు పలువురు నేతలకు మంత్రి హరీశ్రావు గులాబీ కండువాలు కప్పి పార్టీలోకి స్వాగతించారు. ఉదయ్కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్, బీజేపీపై ప్రజలకే కాదు ఆయా పార్టీ నేతల కుటుంబసభ్యులకు కూడా నమ్మకం పోయిందని చెప్పారు. బీఆర్ఎస్ విజయానికి కృషి చేస్తానని ఉదయ్ పేర్కొన్నారు. కార్యక్రమంలో స్టేట్ ట్రేడ్ ప్రమోషన్ కార్పొరేషన్ చైర్మన్ మఠం భిక్షపతి, మార్క్ఫెడ్ డైరెక్టర్ జగన్మోహన్రెడ్డి, నాయకులు జైపాల్రెడ్డి, కాశీనాథ్ తదితరులు పాల్గొన్నారు.