బీజేపీకి గుజరాత్ తప్ప మరో ఆలోచన లేదు
ఆర్టీసీ, ప్రభుత్వరంగ సంస్థలను అమ్మితే
రెండు వేల కోట్లు బహుమానం ఇస్తరట
బాయిలకాడ మీటర్లకు 25 వేల కోట్ల బేరం
బీజేపీ ప్రభుత్వానిది ఫక్తు వ్యాపార ధోరణి
తెలంగాణకు రూ.9 వేల కోట్ల ఎగనామం
కేసీఆర్ పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష
మెదక్ జిల్లా నర్సాపూర్ ఆర్టీసీ బస్సు డిపో
ప్రారంభోత్సవ సభలో మంత్రి హరీశ్రావు
మెదక్, జూన్ 8 (నమస్తే తెలంగాణ): కేంద్రంలోని బీజేపీ సర్కారు మాటలు తెలంగాణకు చెప్తూ.. మూటలు మాత్రం గుజరాత్కు తరలించుకుపోతున్నదని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు విమర్శించారు. బీజేపీకి గుజరాత్ రాష్ట్రం తప్ప మరో ఆలోచన లేదని మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ ఏదో ఒకటి అమ్ముదామని చూస్తున్నదని, బీజేపీకి అమ్మడం తప్ప వేరే పనేలేదని ఎద్దేవా చేశారు. మెదక్ జిల్లా నర్సాపూర్లో రూ.4.65 కోట్లతో నిర్మించిన ఆర్టీసీ బస్సు డిపోను బుధవారం రవాణాశాఖ మంత్రి పువ్వాడ అజయ్కుమార్తో కలిసి ఆయన ప్రారంభించారు. నర్సాపూర్ ఎమ్మెల్యే మదన్రెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సభలో మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. విశాఖ ఉక్కు ఫ్యాక్టరీని అమ్మిందని, బీఎస్ఎన్ఎల్లో 50 వేల ఉద్యోగాలను తీసివేసిందని మండిపడ్డారు. రైల్వే ప్రైవేటీకరణ, స్టేషన్ల ప్రైవేటీకరణ చేస్తున్నదని ఫైరయ్యారు.
ప్రభుత్వ సంస్థలను కూడా విక్రయించాలని రాష్ట్రాలకు ఉచిత సలహాలు ఇస్తున్నదని మండిపడ్డారు. రాష్ట్రంలోని ప్రభుత్వ రంగ సంస్థలను అమ్మితే రూ.2 వేల కోట్ల్ల ప్రైజ్ ఇస్తమని ఢిల్లీ నుంచి తెలంగాణ ఆర్థికశాఖకు ఉత్తరం వచ్చిందని మంత్రి అన్నారు. ‘బాయిలకాడ మీటర్లు పెడితే రూ.25 వేల కోట్లు ఇస్తరట! ఆర్టీసీ లాంటి ప్రభుత్వ రంగ సంస్థను అమ్మితే రూ.2 వేల కోట్లు ఇస్తరట! ఇదెక్కడి పరిపాలన?’ అని బీజేపీ ప్రభుత్వంపై హరీశ్రావు మండిపడ్డారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజల కోసం కొత్త సంస్కరణలు తీసుకురావాలని, వారి సంక్షేమానికి పాటుపడాలని సూచించారు. కానీ, బీజేపీ ప్రభుత్వం ఫక్తు వ్యాపార ధోరణితో వ్యవహరిస్తున్నదని, ఎట్లా లాభాలు సంపాదించాలే.. ఎట్లా అమ్మాలే అనే ఆలోచన తప్ప మరో ఆలోచన చేయ డం లేదని విమర్శించారు. అసలు మీ ప్రభుత్వ పాలసీ ఏమిటని బీజేపీ నాయకులను మంత్రి ప్రశ్నించారు. తెలంగాణకు 15వ ఆర్థిక సంఘం నుంచి హక్కుగా రావాల్సిన రూ.9 వేల కోట్లకు ఎగనామం పెట్టారని అన్నారు. సీఎం కేసీఆర్ నేతృత్వంలోని పాలనే తెలంగాణకు శ్రీరామరక్ష అని అన్నారు.
డబుల్ డెక్కర్ గవర్నమెంట్లో ఆరు గంటలే కరెంటు
డబుల్ డెక్కర్ ప్రభుత్వం ఉన్న కర్ణాటక, గుజరాత్ రాష్ర్టాల్లో ఆరు గంటల కూడా సక్రమంగా కరెంటు ఇవ్వడం లేదని, అదే తెలంగాణ రాష్ట్రంలో 24 గంటలూ నాణ్యమైన విద్యుత్తు సరఫరా అవుతుదన్నదని మంత్రి హరీశ్రావు చెప్పారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలు బీజేపీ, కాంగ్రెస్ పాలిత రాష్ర్టాల్లో అమలవుతున్నాయా? అని నిలదీశారు. బీజేపీ, కాంగ్రెస్లకు ప్రజలను మోసం చేయడం మాత్రమే తెలుసని ఆగ్రహం వ్యక్తం చేశారు. 70 ఏండ్లలో గత ప్రభుత్వాలు ఒక్క చెక్డ్యాం నిర్మించలేదని, అదే తెలంగాణ రాష్టం అధికారంలోకి వచ్చిన ఎనిమిదేండ్లలో 15 చెక్డ్యామ్లు మెదక్ జిల్లాలో నిర్మించామని గుర్తు చేశారు. మల్లన్నసాగర్ నీళ్లు త్వరలో నర్సాపూర్కు తీసుకొచ్చి నియోజకవర్గ ప్రజల పాదాలు కడుగుతామని తెలిపారు.
ఆర్టీసీని బతికిస్తున్న సీఎం కేసీఆర్: మంత్రి పువ్వాడ అజయ్కుమార్
సమైక్య పాలనలో ఆర్టీసీ కొత్త డిపోలకు నోచుకోలేదని, తెలంగాణలో ఆర్టీసీని సీఎం కేసీఆరే బతికించారని మంత్రి అజయ్కుమార్ చెప్పారు. ఆర్టీసీ నష్టాల్లో ఉన్నప్పటికీ ముఖ్యమంత్రి కేసీఆర్.. బడ్జెట్లో సంస్థకు నిధులు కేటాయిస్తున్నారని గుర్తుచేశారు. సంస్థ బలోపేతానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తున్నదని చెప్పారు. కార్గో ద్వారా ఆర్టీసీకి ఆదాయం సమకూరుతున్నదని తెలిపారు. నర్సాపూర్ ఆర్టీసీ డిపో అభివృద్ధికి కృషి చేస్తానని, ఎన్ని బస్సులు అవసరం ఉన్నా అందించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కార్యక్రమంలో మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ సునీతారెడ్డి, మెదక్ జడ్పీ చైర్పర్సన్ హేమలతశేఖర్గౌడ్, డీసీసీబీ చైర్మన్ చిట్టి దేవేందర్రెడ్డి, ఎమ్మెల్సీ శేరి సుభాష్రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి, అసంఘటిత కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ దేవేందర్రెడ్డి, మెదక్ కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, డీసీఎంఎస్ చైర్మన్ శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.