గజ్వేల్, నవంబర్ 8: రాష్ట్రంలో తెలంగాణ ద్రోహులంతా ఏకమవుతున్నారని, ప్రజలు జాగ్రత్తగా ఉండకపోతే నష్టపోతామని మంత్రి హరీశ్రావు హెచ్చరించారు. రిస్క్ లేని కేసీఆర్ ప్రభుత్వాన్నే మరోసారి ఆశీర్వదించాలని కోరారు. గజ్వేల్లో గురువారం సీఎం కేసీఆర్ నామినేషన్ వేయను న్న దృష్ట్యా బుధవారం సాయంత్రం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆ యన స్థానిక మీడియాతో మాట్లాడారు. తె లంగాణలో షర్మిల కాంగ్రెస్కు, పవన్కల్యా ణ్ బీజేపీకి మద్దతు పలుకుతున్నారని తెలిపారు. నాడు ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటును వ్య తిరేకించిన శక్తులు నేడు కాంగ్రెస్, బీజేపీ ముసుగులో తెలంగాణపై దాడికి కుట్ర చేస్తున్నాయని, ఈ విషయంలో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని పిలుపునిచ్చారు.
డీకే శివకుమార్కు ధన్యవాదాలు
కర్ణాటకలో 5 గంటల కరెంట్ మాత్రమే ఇస్తున్నట్లు ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ ఒప్పుకొన్నందుకు తెలంగాణ ప్రజలంతా ఆయనకు ధన్యవాదాలు చెప్పాలని మంత్రి హరీశ్రావు సూచించారు. రేవంత్ 3 గంటల కరెంట్ చాలని చెప్పి, ఇప్పుడు మాట మార్చారని, తాను అలా అనలేదని బుకాయిస్తున్నాడని మండిపడ్డారు. అన్న మాటలను వీడియోల్లో తెలంగాణ ప్రజలంతా చూశారని అన్నారు. రైతులు 5 గం టల కరెంట్ కావాలనే వాళ్లు కాంగ్రెస్కు, 24 గంటలు కావాలనుకునే వాళ్లు బీఆర్ఎస్కే ఓటు వేస్తారని చెప్పారు. ఈ సమావేశంలో ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, డీసీసీబీ చైర్మన్ దేవేందర్రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
బీఆర్ఎస్లో చేరిన మాజీ జడ్పీ చైర్మన్
అందోల్ నియోజకవర్గంలో అంతంత మాత్రంగా ఉన్న బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ వైఖరి, ఆ పార్టీలోని మరో నేత బాబుమోహన్ తీరుపై కొద్దిరోజులుగా అసంతృప్తితో ఉన్న ఉమ్మడి మెదక్ మాజీ జడ్పీ చైర్మన్ బాలయ్య ఆ పార్టీని వీడి బుధవారం ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆధ్వర్యంలో మంత్రి హరీశ్రావు సమక్షంలో బీఆర్ఎస్లో చేరారు. ఆయనతోపాటు మరికొందరు పార్టీలో చేరగా మంత్రి వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు. ఈ సం దర్భంగా మంత్రి మాట్లాడుతూ బాలయ్య కు పార్టీలో సముచిత స్థానం కల్పిస్తామని తెలిపారు. కాంగ్రెస్- బీజేపీలపై ప్రజలకు, ఆ పార్టీల నాయకులకు నమ్మకం పోయిందని అన్నారు. అంతకుముందు సంగారెడ్డి జిల్లా బీజేపీ అధికార ప్రతినిధి చింతల్ గట్టు సుధీర్కుమార్, కోహీర్ మండల మాజీ ఎంపీపీ జంపల అనిత మంత్రి హరీశ్రావు సమీక్షంలో బీఆర్ఎస్లో చేరారు. బుధవారం ఉదయం హైదరాబాద్లో గులాబీ కండువా కొప్పుకొన్నారు.