Minister Harish Rao | గాంధీ ఆస్పత్రిలో తొలిసారిగా ప్రభుత్వ ఐవీఎఫ్ సెంటర్ను ఇవాళ తెలంగాణ సర్కార్ అందుబాటులోకి తీసుకొస్తున్నదని రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ఇది చరిత్రలో మైలురాయిగా నిలిచిపోతుందని వ్యాఖ్యానించారు. అత్యంత ఖరీదైన ఐవీఎఫ్ ట్రీట్మెంట్ను ఇప్పుడు ప్రజలకు ఉచితంగా అందుబాటులోకి తీసుకొచ్చినందుకు సీఎం కేసీఆర్కు ట్విట్టర్ (ఎక్స్ ) వేదికగా ధన్యవాదాలు తెలిపారు.
అన్ని రంగాల్లో దూసుకెళ్తూ తెలంగాణ రాష్ట్రం యావత్ దేశానికే ఆదర్శంగా నిలుస్తోందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఆరోగ్య తెలంగాణ సాధించిన ఈ అపూర్వ విజయాన్ని సెలబ్రేట్ చేసుకోవడంలో అందరూ భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. తెలంగాణ అమలు చేస్తోంది.. దేశం ఆచరిస్తోందని వ్యాఖ్యానించారు.
Today is a historic milestone as Telangana government sets up the first government IVF (In vitro fertility) center at Gandhi hospital.
Thanks to Hon’ble #CMKCR garu’s visionary leadership, expensive IVF treatments are now free making services accessible and affordable to… pic.twitter.com/HR0oVsvso5
— Harish Rao Thanneeru (@BRSHarish) October 8, 2023
కాగా, సంతానం లేని దంపతుల కోసం తెలంగాణ ప్రభుత్వం.. రాష్ట్రంలో తొలిసారిగా ఇన్-విట్రో-ఫెర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సెంటర్ను అందుబాటులోకి తెస్తున్నది. రూ.5 కోట్లతో గాంధీ దవాఖానలో సంతాన సాఫల్య కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. మాతా, శిశు ఆరోగ్య కేంద్రం భవనంలోని ఐదో అంతస్థులో ఏర్పాటు చేసిన ఈ కేంద్రాన్ని ఆదివారం మంత్రులు హరీశ్రావు, తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రారంభించనున్నారు. 2018 నుంచి గాంధీ దవాఖానలో ఐయూఐ విధానం ద్వారా సంతాన సాఫల్య కేంద్రం నిర్వహిస్తున్నామని, మందులు వాడటంతో ఇప్పటివరకు 200 మహిళలకు సంతానం కలిగిందని దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ ఎం రాజారావు చెప్పారు.