సిద్దిపేట: స్వరాష్ట్రం ఏర్పడిన తర్వాత గంగపుత్రుల పంట పండిందని మంత్రి హరీశ్ రావు అన్నారు. ఒకప్పుడు ఆంధ్ర రాష్ట్రం నుంచి చేపలు తెచ్చుకునే వాళ్లమని, ఇప్పుడు చేపలను విదేశాలకు అందించే స్థాయికి తెలంగాణ గంపుత్రులు ఎదిగారని చెప్పారు. సిద్దిపేటలోని కోమటి చెరువులో మంత్రి హరీశ్ రావు చేపపిల్లను విడుదల చేశారు. అనంతరం మాట్లాడుతూ.. కాళేశ్వరం నీళ్లతో రాష్ట్రంలో చెరువులు కళకళ లాడుతున్నాయని వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా 120 కోట్ల చేపలను చెరువుల్లో వదులుతున్నామని తెలిపారు. సిద్దిపేట నియోజక వర్గంలోని అన్నిచేరువుల్లో చేపలు విడుదల చెయాలని అధికారులకు సూచించారు.