CPR | ఇటీవల కాలంలో ఎంతో మంది గుండెపోటు( Heart Stroke )కు గురవుతున్నారు. అలాంటి వారికి సీపీఆర్( CPR ) చేసి, వారి ప్రాణాలను కాపాడాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం( Telangana Govt ) విస్తృతంగా ప్రచారం చేస్తుంది. అన్ని జిల్లా కేంద్రాలతో పాటు సామాజిక మాధ్యమాల్లో( Social Media ) సీపీఆర్పై అవగాహన కల్పిస్తుంది ప్రభుత్వం. ప్రత్యేక శిక్షణా తరగతులను కూడా ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. ఈ క్రమంలో చాలా మందికి సీపీఆర్పై అవగాహన ఏర్పడింది.
గుండెపోటుకు గురైన వారికి అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్( CPR ) చేసి ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు( Minister harish rao ) అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
సిద్దిపేట జిల్లాలోని కుకునూర్ పల్లి మండలం పరిధిలోని చిన్న కిష్టాపురానికి చెందిన రాజు అనే యువకుడి ప్రాణాలను 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడిన విషయం తెలిసిందే. హైదరాబాద్ హయత్ నగర్లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి రాచకొండ పరిధిలోని రామన్నపేట సీఐ సీపీఆర్ చేసి మానవత్వం చాటుకున్నారు అని మంత్రి తెలిపారు.
సీఎం కేసీఆర్( CM KCR ) ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా సీపీఆర్ శిక్షణ కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. సీపీఆర్పై ప్రతి ఒక్కరికీ అవగాహన పెరిగితే ఎంతోమంది ప్రాణాలను కాపాడవచ్చు అని హరీశ్రావు తన ట్వీట్లో పేర్కొన్నారు.
అత్యవసర సమయంలో సమయస్ఫూర్తితో వ్యవహరించి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడుతున్న రియల్ హీరోలకు అభినందనలు.
కుకునూర్ పల్లి మండలం, చిన్న కిష్టాపురానికి చెందిన రాజు అనే యువకుడి ప్రాణాలను 108 సిబ్బంది సీపీఆర్ చేసి కాపాడగా, హైదరాబాద్ హయత్ నగర్ లో కారు నడుపుతూ గుండెపోటుకు గురైన వ్యక్తికి… pic.twitter.com/AGYopAGmc9
— Harish Rao Thanneeru (@BRSHarish) March 31, 2023