హైదరాబాద్, జూలై 11 (నమస్తే తెలంగాణ): తెలంగాణ పునర్నిర్మాణంలో ఇంజినీర్ల పాత్ర ఎంతో కీలకమని ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్రావు తెలిపారు. ఇంజినీర్ల సహకారంతో తొమ్మిదేండ్లలోనే దేశంలో కనీవినీ ఎన్నో ప్రాజెక్టులను నిర్మించినట్టు పేర్కొన్నారు. మంగళవారం నవాబ్అలీ జంగ్ బహదూర్ జయం తి, తెలంగాణ 10వ ఇంజినీర్స్ డే సందర్భంగా ‘ఇంజినీర్లకు సెల్యూట్’ చేస్తూ హరీశ్రావు ట్వీట్ చేశారు.
ఇంజినీర్ల గొప్ప ఆలోచనలతో తెలంగాణ స్వరూపమే మారిపోయిందని తెలిపారు. కాళేశ్వరం ప్రాజెక్టు, టీహబ్, యాదాద్రి ఆలయం, మిషన్ భగీరథ, పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్, టీవర్క్స్, దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జి, తెలంగాణ సెక్రటేరియట్, తెలంగాణ అమరుల స్మారక చిహ్నం ఫొటోలను ట్వీట్కు జత చేశారు. దేశంలోని మరే రాష్ర్టాల్లో ఇటువంటి నిర్మాణాలు జరగలేదని పేర్కొన్నారు.