హైదరాబాద్ : భారీ వర్షాలు, వరదల నేపథ్యంలో డెంగీ, మలేరియా ఇతర సీజనల్ వ్యాధులు ప్రబలకుండా తీసుకోవాల్సిన చర్యలు, సంసిద్ధత, బూస్టర్ డోసు పంపిణీ తదితర అంశాలపై బీఆర్కే భవన్లో ఆర్థిక, వైద్యారోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు సమీక్ష నిర్వహించారు. మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, సబితా ఇంద్రారెడ్డి, కొప్పుల ఈశ్వర్, గంగుల కమలాకర్, సత్యవతి రాథోడ్, ఇతర ఉన్నతాధికారులతో పాటు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాల కలెక్టర్లు ఈ సమీక్షలో పాల్గొన్నారు.