హైదరాబాద్ : ప్రభుత్వ ఉద్యోగాల నియామక ప్రక్రియపై రాష్ట్ర ఆర్థిక మంత్రి హరీశ్రావు సమీక్ష నిర్వహించారు. ఈ సమీక్షలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్, వివిధ శాఖల కార్యదర్శులు, వివిధ నియామక సంస్థల అధికారులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ.. ఉద్యోగాల నియామకాల ప్రక్రియను వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. నోటిఫికేషన్ల జారీలో వేగం పెంచాలని సూచించారు. గ్రూప్ -3, 4 ఇంజినీర్ల నియామకాల నోటిఫికేషన్లు త్వరగా ఇవ్వాలని చెప్పారు. ఇప్పటికే గ్రూప్ -1, ఎస్ఐ, పోలీసు కానిస్టేబుల్ ఉద్యోగాలతో పాటు పలు ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్లు వెలువడిన సంగతి తెలిసిందే.