హైదరాబాద్, ఫిబ్రవరి 8(నమస్తే తెలంగాణ): ప్రజలపై కొత్త పన్నులు వేసే ఆలోచన తమ ప్రభుత్వానికి లేనే లేదని ఆర్థిక మంత్రి హరీశ్రావు తేల్చి చెప్పారు. ప్రజలకు ఇబ్బంది కలుగకుండా ఇతర మార్గాల ద్వారా ఆదాయా న్ని సమకూర్చుకుంటున్నట్టు తెలిపారు. ఈ మేరకు బుధవారం శాసనసభలో బడ్జెట్పై చర్చ సందర్భంగా ఎమ్మెల్యేలు అక్బరుద్దీన్, మల్లు భట్టి విక్రమార్క, జగ్గారెడ్డి, రఘునందన్రావు అడిగిన ప్రశ్నలకు మంత్రి సమాధానమిచ్చా రు.
ఆదాయాన్ని ఏవిధంగా సమకూర్చుకోవాలన్నదానిపై సీఎం కేసీఆర్ ప్రత్యేకంగా రెవెన్యూ రిసోర్స్ మొబిలైజేషన్ క్యాబినెట్ సబ్కమిటీని ఏర్పాటు చేశారని తెలిపారు. ఇది ఒక్క భూ ముల అమ్మకం ద్వారానే కాకుండా ఇతర మా ర్గాల్లోనూ ఆదాయం సమకూర్చుకోవడంపై దృ ష్టి పెట్టిందని చెప్పారు. జూన్లోపు రూ.20 వేల కోట్లకు పైగా ఆదాయం వచ్చేలా ప్రభుత్వం ప్రణాళికలు సిద్ధం చేసుకున్నదని వివరించారు. ఇక పీఆర్సీ బకాయిలపై అక్బరుద్దీన్ ప్రశ్నకు సమాధానం చెబుతూ, విడతల వారిగా పీఆర్సీ బకాయిలు చెల్లిస్తామని వెల్లడించారు.
బీజేపీ రాష్ట్రంలో ఎరువుల కోసం చావులు
రాష్ట్రంలో ఎరువులు దొరకడం లేదన్న బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు మాటలకు మంత్రి దీటుగా బదులిచ్చారు. డబుల్ ఇంజిన్ గవర్నమెంట్ ఉన్న మధ్యప్రదేశ్లో ఎరువులు దొరక్క, క్యూలో నిల్చొని ఆరుగురు రైతులు మరణించారని తెలిపారు. తెలంగాణ రాష్ట్రంలో మాత్రం ఆ పరిస్థితి లేదని స్పష్టం చేశారు. ప్రణాళికాబద్ధంగా పని చేసి ఏప్రిల్, మే నెలలోనే ఎరువులు తీసుకొచ్చి బఫర్ స్టాక్ పెట్టడం వల్ల రాష్ట్రంలో ఎరువుల కొరత లేదని చెప్పారు.
కాంగ్రెస్ అన్నీ చేస్తే.. కోతలెందుకు
గతంలో కాంగ్రెస్ ప్రభుత్వమే అన్నీ చేసిందని, టీఆర్ఎస్ ప్రభుత్వం చేసిందేమి లేదం టూ కాంగ్రెస్ శాసనసభాపక్ష నేత భట్టి విక్రమార్క చేసిన వ్యాఖ్యలపై మంత్రి హరీశ్రావు మండిపడ్డారు. ‘అన్నీ మీరే చేస్తే మీ ప్రభుత్వం లో కరెంట్ కోతలు ఎందుకున్నాయి? పవర్ హాలీడేలు ఎందుకున్నాయి? ఎందుకు క్రాప్ హాలిడేలు ఉన్నాయి? అని నిలదీశారు. మంచినీళ్లు ఇచ్చుంటే గతంలో హైదరాబాద్లో మూ డు నాలుగు రోజులకోసారి నీళ్లు వచ్చే పరిస్థితి ఎందుకొచ్చిందని ప్రశ్నించారు. ఖాళీ కుండల ప్రదర్శన ఎందుకు జరిగిందని అడిగారు.
యథావిధిగా డబుల్ బెడ్రూం పథకం
డబుల్ బెడ్రూం ఇండ్ల పథకం యథావిధిగా కొనసాగుతున్నదని, ఇందులో ఎలాంటి సందేహం లేదని మంత్రి స్పష్టం చేశారు. హ డ్కో నుంచి వచ్చే నిధుల ద్వారా డబుల్ బెడ్ రూం ఇండ్లు నిర్మిస్తామని చెప్పారు. ఇక స్పోర్ట్స్ పాలసీ తుది దశలో ఉన్నదని, మంత్రి శ్రీనివాస్గౌడ్ నేతృత్వంలోని క్యాబినెట్ సబ్ కమిటీ దీనిపై కసరత్తు చేస్తున్నదని తెలిపారు. త్వరలోనే స్పోర్ట్స్ పాలసీని ప్రకటిస్తారని తెలిపారు.
ప్రతిపక్ష ఎమ్మెల్యేలకు అన్నీ ఇస్తున్నది
కాంగ్రెస్ ఎమ్మెల్యే జగ్గారెడ్డి మాట్లాడుతూ, ‘ప్రతిపక్ష ఎమ్మెల్యేలు ఏది అడిగినా ప్రభుత్వం ఇస్తున్నది. ఇది వాస్తవం. నా నియోజకవర్గానికైతే మెడికల్ కాలేజీ ఇచ్చారు.’ అంటూ ప్రభుత్వాన్ని ప్రశంసించారు.
నీతి ఆయోగ్ చెబితే కేంద్రం వినదు
బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్రావు మాట్లాడుతూ, ‘నీతి ఆయోగ్ ఈజ్ ఓన్లీ రికమెండింగ్ ఇన్స్టిట్యూట్. నీతి ఆయోగ్ చెప్తే కేంద్ర క్యాబినెట్ వినదు. వాళ్లు రికమెండ్ చేసిన దానిపై కేబినెట్ నిర్ణయం తీసుకుంటుంది.’ అన్నారు. మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు నిధులు ఇవ్వాలంటూ నీతి ఆయోగ్ చేసిన సిఫార్సులు కేంద్రం పట్టించుకోలేదని రఘునందన్రావు తేల్చి చెప్పడం గమనార్హం.
హైకోర్టు తీర్పు రాగానే ఉస్మానియా భవనం
రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు ప్రభుత్వం ఉస్మానియా దవాఖానను కొత్తగా నిర్మించాలకుంటున్నదని మంత్రి తెలిపారు.దురదృష్టవశాత్తు కొంత మంది కోర్టుకు వెళ్లటంతో ప్రక్రియకు ఆటంకం కలిగిందని వివరించారు. హైకోర్టు నుంచి తీర్పు రాగానే దవాఖాన నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. ఇక యునాని దవాఖానాల్లోనూ మౌలిక వసతుల కోసం నిధులు ఇచ్చేందుకు ప్రభుత్వం సిద్ధంగా ఉన్నదని వెల్లడించారు.