BRS Manifesto | తెలంగాణ భవితకు భరోసా బీఆర్ఎస్ మేనిఫెస్టో అని మంత్రి హరీశ్రావు అన్నారు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ భవన్లో మేనిఫెస్టో ప్రకటించారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు ట్విట్టర్ వేదికగా స్పందించారు. మేనిఫెస్టో తో బీఆర్ఎస్ గెలుపు ఖాయమన్నారు. సబ్బండ వర్గాల సంక్షేమాన్ని సరికొత్త శిఖరాలకు చేర్చిన, కేసీఆర్ బీమా, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపుతో ప్రతి ఇంటికి ధీమా ఇచ్చిన మేనిఫెస్టో ఇదేనన్నారు. సౌభాగ్యలక్ష్మితో ప్రతి మహిళకు కేసీఆర్ అన్నగా మారిన మేనిఫెస్టో ఇదేనని, తెలంగాణ అన్నపూర్ణతో పేదలకు సన్నబియ్యం అందించే మేనిఫెస్టో ఇదేనన్నారు.
పింఛన్లు, రైతుబంధు పెంపుతో వారిలో కొండంత ధైర్యం నింపిన మేనిఫెస్టో అన్నారు. హైదరాబాద్లో మరో లక్ష మంది పేదల ఆత్మగౌరవాన్ని పెంచే మేనిఫెస్టో అగ్రవర్ణ పేద విద్యార్థులకు గురుకులాలతో అత్యుత్తమ విద్యనందించే.. ఇది అసైన్డ్ ల్యాండ్పై ఆంక్షల ఎత్తివేతకు చర్యలతో బలహీనవర్గాలను ఆదుకునే మేనిఫెస్టో అన్నారు. సీపీఎస్ను వ్యతిరేకిస్తున్న ప్రభుత్వ ఉద్యోగుల ఆకాంక్షలు నెరవేర్చేదన్నారు. ఇది బీఆర్ఎస్ మేనిఫెస్టో మాత్రమే కాదని.. ప్రజల మేనిఫెస్టో అన్నారు.
ముచ్చటగా మూడోసారి గులాబీ జెండాను రెపరెపలాడించే మేనిఫెస్టోనన్నారు. తొమ్మిదిన్నరేండ్లుగా ఇచ్చిన హామీలు అమలు చేసి, ఇవ్వని హామీలను కూడా ఆచరణలోకి తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్దేనన్నారు. విజన్, కమిట్మెంట్ ఉన్న నాయకుడిగా.. ఈ హామీలను సైతం వందశాతం అమలు చేస్తారని ప్రజలు నమ్ముతున్నారన్నారు. అందుకే బీఆర్ఎస్ మేనిఫెస్టోతో ప్రజలు సంబురాల్లో మునిగితే.. ప్రతిపక్షాలు మాత్రం నైరాశ్యంలో మునిగిపోయాయన్నారు. సీఎం కేసీఆర్ మాస్టర్ స్ట్రోక్తో దిక్కుతోచని స్థితిలో పడిపోయాయన్నారు. వచ్చే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ కొడుతూ.. రికార్డ్ సృష్టించబోతున్నదన్నారు.